తనకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు హైదరాబాద్ లోని అంబర్ పేట్ నియోజకవర్గంలోని బాగ్ అంబర్ పేట డివిజన్ బిజెపి కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.
ఎస్బిఐ కాలనీ పార్క్, ఎస్బిహెచ్ కాలనీ పార్క్, సి.ఈ కాలనీ పార్క్ లలో కాలనీ అసోసియేషన్ సభ్యులను ఆమె నేడు కలిశారు.
ఈ సందర్భంగా పద్మ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియచేశారు.