40.2 C
Hyderabad
April 28, 2024 17: 50 PM
Slider ఆధ్యాత్మికం

ఎస్వీబీసీ ఛానల్ పై సమీక్ష

#svbc

ఎస్వీబీసీ హిందీ ఛానల్ ద్వారా శ్రీవేంకటేశ్వర స్వామి వైభవాన్ని దేశమంతటా ప్రచారం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై టిటిడి ఈవో ధర్మారెడ్డి  సమీక్ష  నిర్వహించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో ఎస్వీబీసీ సిఈఓ షణ్ముఖ్‌కుమార్, జియో వైస్ ప్రెసిడెంట్(ముంబై),  ఐటి జిఎం సందీప్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమల, ఇతర అనుబంధ ఆలయాల్లో నిర్వహిస్తున్న వివిధ సేవలు, కైంకర్యాలు, పండుగలు, ధార్మిక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి భక్తుని చెంతకు తీసుకెళ్లాలన్న ప్రధాన ఉద్దేశంతో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రారంభమైందన్నారు. ఎస్వీబీసీ తెలుగు, తమిళం, కన్నడ ఛానళ్లు ఇప్పటికే విశేష ప్రజాదరణ పొందాయన్నారు. ఎస్వీబీసీ హిందీ ఛానల్ కు కూడా ప్రాచుర్యం కల్పించేందుకు హిందీ మాట్లాడే ప్రాంతాలలో జియో వంటి వేదిక అవసరమన్నారు. జియో ఫైబర్ నెట్ ప్లాట్‌ఫారమ్‌లో ఎస్వీబీసీ  హిందీ ఛానల్ ను ప్రసారం చేయడం, ఎస్వీబీసీ ఆన్‌లైన్ రేడియోకు మరింత ప్రాచుర్యం కల్పించడంపై జియో అధికారులతో చర్చించాలని ఎస్వీబీసీ సిఈఓను ఆదేశించారు.

Related posts

చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు

Satyam NEWS

వినాయక్ సీనయ్య ఫస్ట్ లుక్ విడుదల

Satyam NEWS

డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ కు మంత్రి పువ్వాడ శుభాకాంక్షలు

Satyam NEWS

Leave a Comment