సమస్యల పరిష్కారంలో కాలనీ సంక్షేమ సంఘాలు ప్రధాన భూమికను పోషిస్తూ సమన్వయంతో ముందుకు సాగుతూ ఉండడం అభినందనీయమని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, బి ఎల్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం కీసర అతిథిగృహంలో జరిగిన చర్లపల్లి డివిజన్ కాలనీ సంక్షేమ సంఘాల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో బండారి లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవడంలో కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పరస్పరం సమన్వయం చేసుకుంటూ సమయత శాఖల అధికారుల దృష్టి కి తీసుకువెళ్తూ సమస్యలను సత్వరంగా పరిష్కరించుకోవడం శుభపరిణామమన్నారు. బి ఎల్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి చర్లపల్లి కాలనీల ముఖ్యులు సంక్షేమ సంఘాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాలనీ సంక్షేమ సంఘాలకు బి ఎల్ ఆర్ ట్రస్టు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి