ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామప్పకు ఇటీవలె యునెస్కో గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రామప్ప దేవాలయం శిల్పసౌందర్య ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి సాహితీ మిత్రమండలి ఆధ్వర్యంలో కవితల పోటీ నిర్వహిస్తున్నారు.
ఈ పోటీలో ఎంపికైన కవితలకు ప్రథమ, ద్వీతీయ, తృతీయ బహుమతులుగా రూ॥2000/- ,రూ॥1000/- ,రూ॥500 గా అందజేస్తామని సాహితీ మిత్ర మండలి ప్రధాన కార్యదర్శి అడప రాజు తెలిపారు.
కవితలు పంపడానికి చివరి తేదీ 30-సెప్టెంబర్ -2021. చిరునామా: అడప రాజు 2-48/7 సీతారాంపురం, పరకాల మండలం, వరంగల్ రూరల్ జిల్లా 506164, లేదా వాట్సాప్ నెంబర్ -7780618850. ఎంపికైన కవితలతో కవితా సంకలనాన్ని వెలువరుస్తామని కూడా ఆయన తెలిపారు.