Slider గుంటూరు

కరోనాతో మరణించిన పోలీసు కుటుంబాలకు రూరల్ ఎస్పీ భరోసా

#Guntur Rural SP

కరోనా మహమ్మారి బారిన పడి మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు.

మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సహాయత నెంబర్ కేటాయించినట్లు తెలిపారు. పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులతో రూరల్ జిల్లా పోలీస్ కార్యాలయం లో మాట్లాడి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఇబ్బందులు పడుతున్నవారు హెల్ప్ లైన్ నెంబర్ 9440901955 కు ఫోన్ చేయాలని ఎస్పీ కోరారు.

ఈ సందర్భంగా కాకుమాను పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ,రోడ్డు ప్రమాదంలో మరణించిన 2009 బ్యాచ్ కి చెందిన దామర్ల రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులకు రూరల్ ఎస్పీ  చేతుల మీదుగా రూ.5,20,000/- ఆర్ధిక సహాయాన్ని అందించారు. తమ సహోద్యోగికి సహాయం చేయడంలో చూపిన చొరవను ఎస్పీ అభినందించారు.

ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్

Related posts

ఏపీ అగ్రికల్చర్ MPEO ల రెన్యువల్ జివో వెంటనే విడుదల చెయ్యాలి

Satyam NEWS

ఏపిలో కొత్త మద్యం పాలసీకి తాత్కాలిక బ్రేక్

Satyam NEWS

నకిలీ విత్తనాలు అమ్ముతున్న దుకాణాల సీజ్

Bhavani

Leave a Comment