ఏపీలో కొత్త మద్యం పాలసీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్త బార్లకు లాటరీ పద్ధతిని నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీని సవాల్ చేస్తూ బార్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.
previous post