సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ వేణుగోపాల సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తున్న గుజ్జుల కొండారెడ్డి ని మేళ్ళచెరువు మండల కేంద్రంలోని సుప్రసిద్ధ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవస్థానమునకు ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుండి ఉత్తర్వులు వెలువడినట్లు గుజ్జుల కొండారెడ్డి తెలిపారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులను అనుసరించి సోమవారం శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి వారి దేవస్థాన కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కొంకపాక శివవిష్ణు వర్ధన్ శర్మ,ధనుంజయ శర్మ,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్