తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన 8 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విద్యాబోధన తరగతులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్ నుంచి ఆన్ లైన్ లో ఒకేసారి ప్రారంభించనున్నారు. తద్వారా సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్కర్నూల్, రామగుండం పట్టణాల్లోని 8 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబిబిఎస్ తొలి విద్యాసంవత్సరం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నది.
previous post