విజయవాడలోని శ్రీ సంతోషి మాత అమ్మవారి విగ్రహం చోరీ అయింది. ఇక్కడి పాయకాపురంలో శ్రీ సంతోషి మాత అమ్మవారి ఆలయం పునః నిర్మాణం దశలో ఉన్నది. నిర్మాణ దశలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి ఉత్సవమూర్తి పంచలోహ విగ్రహం ఉండేది. అయితే అకస్మాత్తుగా ఆ విగ్రహం అపహరణకు గురైనట్లు గుర్తించారు. ఈ ఉత్సవమూర్తి విగ్రహం బరువు సుమారు 18 కేజీలు ఉంటుందని పోలీసులు తెలిపారు. క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకున్నది. అదే విధంగా సీసీ పూటేజీ ని పోలీసులు పరిశీలిస్తున్నారు.
previous post
next post