దేశంలో వరుసగా ఏడో రోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. పెరిగిన ఇంధన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా మోడీ ప్రభుత్వం మాత్రం ధరలు పెంచడం నిలుపుదల చేయలేదు. నేడు లీటర్ పెట్రోల్పై 90పైసలు, డీజల్ పై 87పైసలు పెంచారు.
ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.114.51, డీజిల్ లీటర్ రూ.100.70.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 101.01, లీటర్ డీజిల్ రూ. 92.27.
ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 115.88, డీజిల్ రూ .100.10
కోల్కతాలో లీటర్ పెట్రోల్ రూ. 110.52, లీటర్ డీజిల్ రూ. 95.42 చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ .106.69, డీజిల్ రూ. 96.76