38.2 C
Hyderabad
April 29, 2024 21: 40 PM
Slider గుంటూరు

“జీవితావలోకనం” పుస్తకావిష్కరణ

#narasaraopetmla

గోల్కొండ హోటల్స్ అధినేత నడికట్టు రామిరెడ్డి జీవితావలోకనం పుస్తకావిష్కరణ కార్యక్రమం నేడు గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ళ గ్రామంలో జరిగింది. నరసరావుపేట శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గ్రామంలోని ఆలయాలను ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లంతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో పేదల కోసం నిర్మించిన గృహాలను పరిశీలించారు. అనంతరం నడికట్టు రామిరెడ్డి మెమోరియల్ స్కూల్ ను సందర్శించారు.

అనంతరం నడికట్టు రామిరెడ్డి “జీవితావలోకనం” పుస్తకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. చిరుమామిళ్ళ గ్రామ శ్రీమంతుడు నడికట్టు రామిరెడ్డి అని డాక్టర్ గోపిరెడ్డి కొనియాడారు. ఆయన జీవితమే ఒక పెద్ద పాఠం అన్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి ఇవాళ గోల్కొండ హోటల్స్ అధినేతగా ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ఆయనది అని ప్రసంశించారు.

ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, కల్పలతా రెడ్డి, ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్  వి లక్ష్మణ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రేసు మహేందర్ రెడ్డి, శ్రీశైలం రెడ్ల సత్రం అధ్యక్షులు గొల్మారు తాతి రెడ్డి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఎం.ఎస్.సుధాకర్, సత్యన్యూస్.నెట్

Related posts

ఫోర్‌ వే పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అనంత

Satyam NEWS

వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!

Bhavani

మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర

Satyam NEWS

Leave a Comment