41.2 C
Hyderabad
May 4, 2024 17: 46 PM
Slider హైదరాబాద్

తెలంగాణాలో 7వ శాఖను ప్రారంభించిన సానీ ఇండియా

#sanyindia

నిర్మాణ రంగ యంత్ర సామాగ్రి, హెవీ మెషినరీ తయారీదారులలో అగ్రగామి అయిన సానీ ఇండియా, హైదరాబాద్‌ లోని పెద్ద అంబర్‌పేట వద్ద తమ 3ఎస్‌ (సేల్స్‌, సర్వీస్‌, స్పేర్స్‌) శాఖను ప్రారంభించింది. ఆధీకృత డీలర్‌ మధుర ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో  కలిసి తెలంగాణాలో తమ నెట్ వర్క్ ను మరింత బలోపేతం చేసుకోవడానికి సానీ ఇండియా చర్యలు తీసుకుంటున్నది.

ఇప్పటికే మియాపూర్‌, ఖైరతాబాద్‌,వరంగల్‌, జడ్జర్ల, కరీంనగర్‌, ఖమ్మం వద్ద సానీ ఇండియా శాఖలు ఉన్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని  సానీ ఇండియా రీజనల్‌ మేనేజర్‌ చేతన్‌ కుమార్‌, మధుర ఇంజినీరింగ్‌ డైరెక్టర్ రంజిత రావు కాట్రగడ్డ నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా వినియోగదారులు, ఫైనాన్షియర్ల సమావేశం నిర్వహించారు. ఈ నూతన కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల సానీ ఇండికా మరిన్ని సేవలను సమర్ధవంతంగా అందించనుంది. 

ఈ నూతన కేంద్రం భవిష్యత్‌ విస్తరణ అవకాశాలను పెంపొందించడంతో  పాటుగా నెట్‌వర్కింగ్‌, భాగస్వామ్యానికి  మరిన్ని అవకాశాలనూ అందిస్తుంది. 2020 నుంచి భారతదేశంలో సానీ ఇండియా, మధుర ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లు నెంబర్‌ 1 ఎక్సకవేటర్‌ డీలర్‌గా ట్రాక్‌ రికార్డును సొంతం చేసుకున్నాయి.

వినియోగదారులకు మరిన్ని సేవలు

ఈ సందర్భంగా సానీ హెవీ ఇండస్ట్రీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ , చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సేల్స్‌, మార్కెటింగ్‌, కస్టమర్‌ సపోర్ట్‌) ధీరజ్‌ పాండా మాట్లాడుతూ ‘‘ మా డీలర్‌షిప్‌ మధుర ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కోసం నూతన  కార్యాలయం ప్రారంభించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. సానీ ఇండియా నుంచి మేము మా మద్దతును అవసరమైనప్పుడల్లా అందిస్తూనే ఉంటాము. ఈ నూతన 3ఎస్‌ సదుపాయం ఈ ప్రాంతంలో  సానీ ఇండియా పట్ల అచంచల విశ్వాసం చూపుతున్న మా వినియోగదారులకు తగిన సేవలను అందించగలదు’’ అని అన్నారు.

 ‘‘సాంకేతికంగా అత్యున్నతమైన యంత్రసామాగ్రిని అందించడానికి మేము నిత్యం కృషి చేస్తూనే ఉన్నాము. వీటి ద్వారా మా వినియోగదారులతో పాటుగా డీలర్లకు సైతం సానుకూల మార్పు తీసుకురాగలం’’ అని అన్నారు.

మధుర ఇంజినీరింగ్‌ ఫౌండర్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మధుసూదన్‌ కాట్రగడ్డ మాట్లాడుతూ ‘‘ నిర్మాణ యంత్ర సామాగ్రి పరిశ్రమకు అవసరమైన వ్యవస్థ తెలంగాణాకు ఉంది. దీనికి తోడు రాష్ట్ర స్ధాయిలో తెలంగాణా ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యాపార వాతావరణంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా దీనికి దోహదపడుతున్నాయి.  వీటితో పాటుగా సానీ ఇండియా నుంచి మాకు అత్యద్భుతమైన సహకారం లభిస్తుంది. ఇది  అవకాశాలను వినియోగించుకునేందుకు, ఓ సంస్థగా అభివృద్ధి చెందేందుకు తోడ్పడింది. ఈ నూతన 3ఎస్‌ శాఖాకార్యాలయం మా విస్తరణకు మరింతగా తోడ్పడనుంది’’ అని అన్నారు.

నిర్మాణ రంగ యంత్ర సామాగ్రి మార్కెట్‌ గణనీయంగా వృద్ధి చెందుతుండటం వల్ల ఈ విస్తరణ ఇప్పటి వరకూ చేరుకోని మార్కెట్‌లను చేరుకునేందుకు, వినియోగదారులను చేరుకునేందుకు తోడ్పడుతుంది. సానీ ఇండియా ఇప్పుడు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800 209 3337ను ఏర్పాటుచేసింది. తమ సందేహాలు, సేవలకు సంబంధించిన సమస్యలను ఇక్కడ పరిష్కరించుకోవచ్చు.

Related posts

ద్వారకా తిరుమలలో శాస్త్రోక్తంగా హనుమత్ జయంతి

Satyam NEWS

కాల్చుకున్న కానిస్టేబుల్

Murali Krishna

అధికారానికి “తీన్మార్” ఇప్పుడే మొదలైంది

Satyam NEWS

Leave a Comment