ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రజకుల కోసం నిరంతర శ్రామికుడిగా పోరాటాలు చేస్తూ ములుగు, భూపాలపల్లి వరంగల్, హన్మకొండ జిల్లాలో మంచి పేరు సంపాదించుకున్న సీనియర్ నాయకులు వడ్డెపల్లి సారంగపాణి ని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి (TRRS) రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించారు.
ఈ మేరకు టిఆర్ఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉల్లెంగల యాదగిరి రజక,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబరాజు రవి రజక నియామక పత్రం అందిజేశారు. ఈ సందర్భంగా సారంగపాణి మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను సమర్ధంగా నిర్వహిస్తానని సమితి అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
పలు సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తానని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. రజకలకు ఏస్సీ హోదా వచ్చేవరకు నిరంతరం పోరాటం చేస్తానని ఆయన అన్నారు. ప్రతి రాజకీయ పార్టీ రజకులకు 5అసెంబ్లీ సీట్లు కేటాఇంచాలని ఆయన డిమాండ్ చేశారు.