32.7 C
Hyderabad
April 27, 2024 01: 02 AM
Slider జాతీయం

రేపు రాజ్యసభ కు హాజరు కానున్న చిదంబరం

Chidambaram

ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసుల్లో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరంకు బెయిల్ మంజూరు కావడంతో రేపు రాజ్యసభ కు హాజరు కానున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు కార్తీ చిదంబరం వెల్లడించారు. 106 రోజుల తర్వాత చిదంబరం బాహ్యప్రపంచాన్ని చూస్తున్నారు.

జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ నేడు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయన దేశం వదలి వెళ్లకుండా ఆయన పాస్ పోర్టును ఉంచివెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. అన్ని లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత చిదరంబం జైలు నుంచి విడుదల అయ్యారు. రేపు ఉదయం రాజ్యసభ కు ఆయన హాజరు కానున్నారు.

Related posts

యువత సేవా దృక్పథంతో ముందుకు సాగాలి

Sub Editor

పాలిటెక్నిక్ కోర్సుల ద్వారా యువ‌త‌కు త‌క్ష‌ణ ఉపాధి…!

Satyam NEWS

త్వరలోనే కాంగ్రెస్ ముక్త్ భారత్ ఆవిష్కృతం?

Satyam NEWS

Leave a Comment