పార్టీలకు అతీతంగా ’సర్ధార్ సర్వాయిపాపన్న సేన’ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు పాలకుల అణచివేత, దోపిడీలపై మామూలు మద్యతరగతి ప్రజలు కూడా తిరుగుబాటు చేసి రాజ్యాధికారం చేజిక్కుంచుకోవటానికి సర్ధార్ సర్వాయిపాపన్న అందరికి స్పూర్తిదాయకమని అన్నారు. బహుజన విప్లవ వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 371 వ జయంతి వేడుకలు ’సర్ధార్ సర్వాయిపాపన్న సేన’ నేర్ధం భాస్కర్గౌడ్ ఆధ్వర్యంలో బుదవారం చిలుకానగర్ ఆదర్శనగర్లోని నోవా బేంక్విట్హాల్ నందు ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి మఖ్య అతిధులుగా మాజీ పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్యగౌడ్, ఉప్పల్ మాజీ ఎమ్మేల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, దమ్మాయిగూడ మున్సిఫల్ చైర్పర్సన్ వసూపతి ప్రణీతశ్రీకాంత్గౌడ్ ,బీసీ సంక్షేమసంఘం రాష్ట్రఅధ్యక్షులు జాజుల శ్రీనివాస్గౌడ్, చిలుకానగర్ కార్పోరేటర్ బన్నాల గీతప్రవీణ్ముదిరాజ్, చర్లపల్లి కార్పోరేటర్ బొంతు శ్రీదేవియాదవ్, రామంతాపూర్ కార్పోరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు, హప్సిగూడ కార్పోరేటర్ చేతన హరీష్, బోడుప్పల్ కార్పోరేటర్లు సీసా వెంకటేశ్గౌడ్, కొత్త శ్రీవిద్యచక్రపాణిగౌడ్, కొత్త స్రవంతికిశోర్గౌడ్, ఉప్పల్ మున్సిఫల్ మాజీ చైర్మన్ మేకల శివారెడ్డి లు పాల్గొని సర్దార్ సర్వాయిపాపన్న విగ్రహానికి పూమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. .
ఈ కార్యక్రమం గజ్జెల సత్యరాజ్ గౌడ్ నేతృత్వంలో , బూట్కూరి నవీన్గౌడ్,రంగా భాస్కర్గౌడ్, కొయ్యడ స్రాద్గౌడ్ పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడ అణగారిన బహుజన గౌడజాతిలో జన్మించి మొగలులకు వ్యతిరేకంగా గోల్కొండ ఖిల్లాపై జెండాను ఎగరవేసిన సర్ధార్ పాపన్నగౌడ్ ఆశయాలను స్పూర్తిగా తీసుకొని నేటి యువత కృషి చేయాలనిపిలుపునిచ్చారు. సామాన గౌడు కులం నుండి బహుజన వర్గాల ఆత్మవిశ్వాస ప్రతీకగా ఎదిగిన పాపన్న జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్చేశారు. గౌడసోదరులంతా రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేయాలని పలుపునిచ్చారు. కార్యక్రమంలో శ్రీనివాస్రెడ్డి, బాల లక్ష్మి, సాంబశివగౌడ్, సురేష్,ప్రవీణ్, అంజయ్య, అమృతం, సాంవమియాదవ్, ప్రసాద్, కనకరాజ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.