అన్నమయ్య జిల్లా రాజంపేటలో చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా రాజు విద్యాసంస్థలం అధినేత టీడీపీ నాయకుడు జగన్మోహన్ రాజు ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. అంతకు ముందు ఆయన బలిజ పల్లె గంగమ్మకు 101 టెంకాయాలు కొట్టి పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.
అనంతరం చంద్రబాబు నాయుడు పేరిట ముస్లింకు ప్రతి రంజాన్ కు చంద్రన్న రంజాన్ తోఫా పంపిణీ చేసారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అయిన తర్వాత రంజాన్ తోఫా తీసేసి పేద మైనార్టీ కుటుంబాలకు నోటికాడ తీసేసాడని దాంతో చంద్రబాబు నాయుడు ఆశయాలతో చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్బంగా పేద మైనారిటీ కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నాను అని జగన్ మోహన్ రాజు అన్నారు.
తోపా తెచ్చిన వివాదాం
అంతకు వరకు బాగానే ఉన్నా ఈ తోఫా కార్యక్రమంలో వైసీపీ నేత ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి అనుచరుడు,రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ చైర్మన్ గండి కోట గుల్జార్ బాషా తో చమర్ధి జగన్మోహన్ రాజు తో కలిసి హాల్ చల్ చేయడం రాజంపేట టీడీపీ లో చర్చనీ యాంశంగా మారింది. రంజాన్ తోఫా ఇచ్చే వీడియో వారి అనుచరులు అత్యుత్సాహం తో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇది కాస్త వివాదం నెలకొంది.
టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు, నారా లోకేశ్ వైసీపీ పై పోరాటం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారం లోకి రావాలని తీవ్రంగా కృషి చేస్తుంటే, ఇలా దిగువ శ్రేణి నాయకులు వైసీపీ నేతలతో చెట్టా పట్టా లేసుకుని తిరగడం రాజంపేట నియోజకవర్గ టీడీపీ పార్టీలోని కార్యకర్తలను అయోమయం కు గురి చేస్తోందని వాపోతున్నారు. దీనిపై టీడీపీ వాట్సప్ గ్రూప్ లల్లో చర్చ నడుస్తోంది.దీనికి తోడు ఓ దినపత్రిక లో “టీడీపీ లో కోవర్టు లు”అంటూ రాయచోటి జిల్లా కేంద్రం నుంచి వార్త రావడం కూడా దీనికి ఉతమిచ్చేలా ఉండడంతో టీడీపీ అధినేత దృష్టి సారించి చక్క దిద్దక పోతే చేచేతులా అవకాశాన్ని జారవిడుచుకునే అవకాశం ఉందనే వ్యాఖ్యలు బహిరంగంగా వినబడుతున్నాయి.