కరోనా ఉద్ధృతి నేపథ్యంలో అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని శ్రీ సత్య సాయి సూపర్ హాస్పిటల్ లో వైద్య సేవలు నిలుపుదల చేశారు. వైద్యం కొరకు ఇతర రాష్ట్రాల నుండి హాస్పిటల్ కు వచ్చే రోగులకు తాత్కాలికంగా వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. గత వారం రోజులుగా ఇతర రాష్ట్రాల నుండి పుట్టపర్తికి వస్తున్న వారికి అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ప్రకటన వెలువడే వరకు సుదూర ప్రాంతాల వాసులకు వైద్య సేవలు లభించవు. అయితే పుట్టపర్తి పరిసర వాసులకు మినహాయింపు ఇచ్చారు. కరోనా టెస్ట్ రిపోర్ట్ తో స్థానిక మండల ప్రజలు, సూపర్ హాస్పిటల్ లో వైద్య సేవలు వినియోగించుకోవచ్చు.
previous post