చిత్తూరు జిల్లా మదనపల్లిలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. మదనపల్లి మండలంలోని వలసపల్లి సంక్రాంతి వేడుకల్లో ఆదివారం అర్ధరాత్రి ఈ దారుణ ఘటన జరిగింది. జంతు బలి కి బదులు మద్యం మత్తులో నరబలి ఇచ్చాడో తలారి. తలారి చలపతి మద్యం మత్తులో పొట్టేలు ను పట్టుకొని ఉన్న సురేష్(35) తల నరికి వేశాడు. కుప్పకూలిన సురేష్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. మృతుడికి భార్య ,ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో సంక్రాంతి పర్వదినం నాడు విషాదఛాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న మదనపల్లె పోలీసులు నిందితుడిని అదుపులోకి హత్య కేసు నమోదు చేశారు. సి.ఐ చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో కేసు పరిశోధన చేస్తున్నారు.
previous post