40.2 C
Hyderabad
April 26, 2024 11: 41 AM
Slider చిత్తూరు

మేక తల బదులు మనిషి తలనరికిన తలారి

Murder

చిత్తూరు జిల్లా మదనపల్లిలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. మదనపల్లి మండలంలోని వలసపల్లి సంక్రాంతి వేడుకల్లో ఆదివారం అర్ధరాత్రి ఈ దారుణ ఘటన జరిగింది. జంతు బలి కి బదులు మద్యం మత్తులో నరబలి ఇచ్చాడో తలారి. తలారి చలపతి మద్యం మత్తులో పొట్టేలు ను పట్టుకొని ఉన్న సురేష్(35) తల నరికి వేశాడు. కుప్పకూలిన సురేష్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. మృతుడికి భార్య ,ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో సంక్రాంతి పర్వదినం నాడు విషాదఛాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న మదనపల్లె పోలీసులు నిందితుడిని అదుపులోకి హత్య కేసు నమోదు చేశారు. సి.ఐ చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో కేసు పరిశోధన చేస్తున్నారు.

Related posts

నిజాంపేట్ కార్పొరేషన్ లో రోజుకో కబ్జా

Satyam NEWS

నిరుద్యోగ గిరిజనులకు ములుగులో జాబ్ మేళా

Satyam NEWS

చైనా గూఢచార బెలూన్ పై అమెరికాలో కల్లోలం

Bhavani

Leave a Comment