శ్రీశైలం ఆలయ ఈవో లవన్నను బాధ్యతల నుంచి తప్పించారు. ఆ స్థానంలో ఆలయ నూతన కార్య నిర్వహణ అధికారిగా పెద్దిరాజు ని నియమించారు. శ్రీశైలం ఆలయంలో చాలా మందిని ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నట్లు ఈయనపై కొంతకాలంగా ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి.
ఆలయంలో కూడా ఈయన అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈయన మాట వినని వారిపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుంటాడని సమాచారం. శ్రీశైలం పరిసర ప్రాంతాలలో ఉన్న వ్యాపారులను కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రాంత వ్యత్యాసంతో తీవ్ర వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు కూడా ఉన్నాయి