అనంతపూర్ జిల్లాకు సంబంధించిన ఐ.ఎమ్.ఎమ్. వ్యవస్థాపక అధ్యక్షుడు మహబూబ్ బాషా కు హైదరాబాదులో ఘనంగా సన్మానం జరిగింది. సుందరయ్య కళానిలయం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నంద చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. పక్కింట్లో కరోనా రోగి ఉంటే ముందుంటి తలుపులు మొత్తం మూసేసుకుంటున్నారు. ఇక ఆస్పత్రుల్లో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారు అనాథలుగానే శ్మశానాలకు తరలిపోతున్న సందర్భంలో రక్త సంబంధీకులు చివరి చూపునకూ ముందుకు రాని సమయంలో అటువంటి మృతదేహాలకు కొందరు ఆత్మబంధువుల్ల మారిన ధార్మిక సంస్థలు, స్వచ్ఛంద సంఘాలు అప్పుడు కొవిడ్ మృతదేహాలను ఆస్పత్రుల నుంచి స్వీకరించి గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిపించాయి. అందులో ఒకరు ఐ. ఏం. ఏం మహబూబ్ బాషా మరియు వీరి బృందం కరోనా సమయంలో చేసిన సేవకు హైదరాబాద్ లో ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ సాహిత్య సంస్కృతిక సామాజిక సేవా సంస్థ వారు అవార్డు ను అందచేశారు.
previous post