కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని గోపాన్ పల్లి గ్రామంలో ఉపాధిహామీ ఏపీఒ తులసిరాం, చిన్న దేవాడా గ్రామంలో మండల పరిషత్ అధికారి మహ్బూబ్ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందువలన కూలీలకు రోజు ఉదయం ఏడు గంటలకు వచ్చి 11 గంటలకు వెళ్ళిపోవచ్చు అన్నారు. పని ప్రదేశంలో మెడికల్ కిట్లు తీసుకురావాలని గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఉపాధి హామీ మేటి లకు సూచించారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందువలన టెంట్లు ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత గ్రూపు మెట్లకు తెలియ చేసారు., నీళ్ల సౌకర్యం కూడా అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలన్నారు. పని ప్రదేశంలో తప్పనిసరిగా ప్రతి కూలీ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. మాస్కులు ధరించని కూలీలకు ఫైన్ లు విధించాలని సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శిలకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ కూలీలు ఉన్నారు.