భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కుమురంబీం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కాగజ్ నగర్ లోని వసుంధర డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పదవ తరగతి ప్రతిభ పరీక్ష విజయవంతమైంది. దీనికి ముఖ్యఅతిథిగా కాగజ్ నగర్ SHO మోహన్, ఎస్సై రాజ్ కుమార్ హాజరై ప్రశ్నాపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ పరీక్షకు మొత్తం 750 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మిడి భీమేష్, చాపిలె సాయి కృష్ణ లు మాట్లాడుతూ ఈ పరీక్ష విజయవంతం కోసం కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యు టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శాంతి కుమారి, DTF జిల్లా కార్యదర్శి రాజ కమలాకర్ రెడ్డి, పీఆర్టీయూ నాయకులు రవికుమార్, కల్వల శంకర్, జిల్లా సైన్స్ అధికారి కటకం మధుకర్ పాల్గొన్నారు.
ఇంకా వసుంధర డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాజమౌళి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్.త్రివేణి, ఎస్సీ ఎస్టీ యూనియన్ జిల్లా కార్యదర్శి చరణ్ దాస్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఆర్ మహేష్, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు భోగ. గిరి కుమార్, ఎన్నం. అశోక్ ఎస్ఎఫ్ఐ నాయకులు పవన్ కళ్యాణ్, దేవి శ్రీ ప్రసాద్, జాడి సంధ్య, చరణ్, తదితరులు కూడా పాల్గొన్నారు.