జె టాక్స్ అంటూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం సమంజసం కాదని వుడా మాజీ చైర్మన్ రెహమాన్ అన్నారు. ఒక వ్యక్తి పర్మిషన్ లేకుండా 10 మందు సీసాలను ప్రెస్ మీట్లో ప్రదర్శించవచ్చా అంటూ ఆయన చంద్రబాబునాయుడిని విమర్శించారు. పాదయాత్రలో మహిళలు విజ్ఞప్తిపై జగన్ దశలవారీగా మధ్య నిషేధం అమలు చేస్తున్నారని దాన్ని అందరూ హర్షించాలని రహెమాన్ అన్నారు.
మద్య నిషేధం అమలు జరుగుతున్న తీరు చూసి రాష్ట్రంలో మహిళలు ఆనందంగా ఉన్నారని, చంద్రబాబు బృందం అనవసర విమర్శలు మానుకోవాలని ఆయన అన్నారు. టీడీపీ హయాంలో ఒక మద్యం షాప్ తీయాలని 109 రోజులు ఆందోళన చేప్పట్టినా స్పందించలేదని ఆయన అన్నారు.