సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్లచెరువు మండల కేంద్రంలో శ్రావణమాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని ‘శ్రావణ శుక్రవారం’గా అత్యంత వైభవంగా నారీమణులు జరుపుకుంటారు.
మండలంలోని పలు శైవ – వైష్ణవ దేవాలయాల్లో ఈరోజు శుక్రవారం వేకువజాము నుండి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పాటు కరోనా రక్కసి అంతమై పోవాలని, ప్రజలు సుఖ – శాంతులతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని విశేష పూజా కార్యక్రమాలు అర్చకులు నిర్వహించారు.
కరోనా కరాళ రక్కసి నియమ నిబంధనలు గ్రామంలో అమలులో ఉండడం వలన ఈ సంవత్సరం దేవాలయంలో భక్తుల సందడి అంతగా కనిపించలేదు.దేవాలయాలు వెలవెల పోయాయి. సాంప్రదాయాలకు అనుగుణంగా ముత్తైదువులు తమ తమ గృహాలలో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ అమ్మవారికి వారి వారి శక్త్యానుసారం పూజలు జరుపుకున్నారు.