విజయనగరం స్థానిక టెలిఫోన్ భవన్లో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఆలుగు వెంకట్రావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ కార్యదర్శి కే రమాదేవి, సర్కిల్ అధ్యక్షులు కామ్రేడ్ లచ్చిరాజు విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు జరిగింది.
విజయనగరం జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా గణరాజు శివాజీ రాజు జేఇ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అలుగు వెంకట్రావు ఆఫీస్ సూపరింటెండెంట్ సహాయ కార్యదర్శిగా టి.కృష్ణకుమారి ఆఫీస్ సూపరింటెండెంట్ కోశాధికారిగా బి భానుచందర్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఆర్ .రమణమ్మ, అక్కమ్మ మొదలగువారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఉద్యోగులు, అధికారులు వీరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ దాలినాయుడు గారు పాల్గొని బిఎస్ఎన్ఎల్ అభివృద్ధి కొరకు ఉద్యోగస్తులు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగులు సన్మానించారు.