తెలంగాణలో ప్రసిద్ది అయిన బొగ్గు ఉత్పత్తిలో రాష్ట్రం చరిత్ర సృష్టించించడం పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఒక్క రోజే 2.24 లక్షల టన్నుల ఉత్పత్తి, 2.35 లక్షల టన్నుల బొగ్గు ను సరఫరా చేయడం సింగరేణి చరిత్రలో అద్భుత గట్టం అని కొనియాడారు. ఐక్యతతో సాధించిన సింగరేణి కార్మికులకు, సిబ్బంది, అధికారులను మంత్రి పువ్వాడ అభినందనలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే చీకట్లు అలుకోడం ఖాయం అన్న వారికి దీటుగా సమాధానం చెప్పరన్నారు. రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే విద్యుత్ సమస్యను పూర్తిస్తాయిలో తొలగించి గృహాలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ ఇస్తు, రైతులకు 24గంటకు ఉచిత విద్యుత్ ను ఇచే స్థాయికి ముఖ్యమంత్రి కేసీఅర్ తీసుకెళ్లారన్నారు. రాష్ట్ర ప్రగతిని చూసి ఇతర రాష్ట్రాలు మన పథకాలను అనుసరిస్తూ ఆయా రాష్ట్రాల్లో వివిధ పేర్లతో ప్రవేశపెట్టడం గర్వకారణం అన్నారు.
previous post