29.7 C
Hyderabad
May 4, 2024 06: 03 AM
Slider వరంగల్

వివిధ కారణాలతో స్వల్పంగా పెరిగిన నేరాల శాతం

#warangalpolice

వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి

వివిధ కారణాలతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతేది కంటే ఈ ఏడాది స్వల్పంగా నేరాల శాతం పెరిగిందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ సంబంధించిన వార్షిక నివేదిక సంబందించి వరంగల్ పోలీస్ కమిషనర్ మీడియా సమావేశాన్ని గురువారం వరంగల్ కోటలోని ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో ముందుగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ నేరాలకు సంబంధించి వార్షిక నివేదికను వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులతో కల్సి ఆవిష్కరించారు.

అనంతరం ఈ ఏడాది కాలంలో నేరాల వారిగా వివరాలను మీడియాకు తెలియజేసారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ మట్లాడుతూ గత ఏడాది 10622 నేరాలు నమోదు కాగా ఈ సంవత్సరం కేవలం 11047 కేసు నమోదయినాయి. గత సంవత్సరం కంటే 3.84 శాతంగా నేరాలు పెరగడం జరిగింది. ప్రధాన నేరాలకు సంబంధించి హత్యలు 17, దోపిడిలు 19, దొంగతనాలు, 238 అధికంగా జరిగినాయి.

ఈ ఏడాది మహిళలపై జరిగిన దాడులకు సంబంధించి మొత్తం 845 కేసులు నమోదు కాగా ఇందులో మహిళలపై వేధింపులకు సంబంధించి 200, ఆత్యాచారాలు 14, వరకట్నచావులు 3 వున్నాయి. రోడ్డు ప్రమాదాల విషయానికి వస్తే ఈ సంవత్సరం 11 శాతం రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగాయని, ఇందులో మొత్తం 1106 రోడ్డు ప్రమాదాల్లో 426 మంది మరణించగా 1110 మంది గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో మొత్తం 11980 కేసులు నమోదు కాగా ఇందులో 1365మంది జైలు పడటంతో పాటు, 65 లక్షల రూపాయల జరిమానాలు విధించబడ్డాయి. ఈ సంవత్సరంలో పలుమార్లు నేరాలకు పాల్పడటంతో పాటు నేరాల నియంత్రణలో భాగంగా 60 మంది నిందితులపై పీడీయాక్ట్ క్రింద కేసులను నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

ముఖ్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడిన మహరాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, వెనెప్టెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 15 దొంగల ముఠాలకు సంబంధించిన 47మంది అంతర్ రాష్ట్ర దొంగలను అరెస్టు చేయడంతో పాటు వీరి నుండి సుమారు కోటి పది లక్షల విలువ గల బంగారు, వెండి అభరాణలతో పాటు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.

టాస్క్ ఫోర్సు పోలీసుల పనితీరు భేష్

సిసిఎస్ పోలీసులు పనితీరుపై పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం సిసిఎస్ పోలీసులు 98 కేసుల్లో 52 మంది నిందితులను పట్టుకోవడంతో పాటు, 97లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా కమిషనరేట్ పరిధిలో టాస్క్ఫ ర్స్ పోలీసులు పనితీరు అభినందనీయమని ప్రస్తుత సంవత్సరంలో వివిధ రకాల కేసులకు సంబంధించి 270 కేసుల్లో 806 మంది నిందితులను అరెస్టు చేయడంతో పాటు సూమారు 4 కోట్ల 71 లక్షల రూపాయల విలువగల వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకోగా, కమిషనరేట్ పరిధిలో 98 గంజాయి కేసులు నమోదు అయ్యాయి.

కాగా ఇందులో 249 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేయడంతో పాటు, కోటి రూపాయలకు పైగా విలువైన వెయ్యి కిలోల గంజాయి పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. ఈ సంవత్సరం ఎక్కడ లేని విధంగా క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేసి 2కోట్లరూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.

వచ్చే సంవత్సరంలో శాంతి భద్రత పరిరక్షణ కోరకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు గంజాయి రహిత కమిషనరేట్ గుర్తింపు తీసుకరావడంతో పాటు ట్రాఫిక్ అదనపు డిసిపి సాయి చైతన్య నేతృత్వంలో ప్రత్యేక ప్రణాళికతో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో ఈస్ట్, వెస్ట్ జోన్ డిసిపిలు వెంకట లక్ష్మీ, సీతారాం లా అండ్ ఆర్డర్ అదనపు డిసిపి సాయి చైతన్య, సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డిసిపి పుష్పా రెడ్డి, అదనపు డిసిపిలు వైభవ్ గైక్వాడ్, భీంరావు, సంజీవ్ తో పాటు ఏసిపిలు, ఇన్స్పెక్టర్లు, ఆర్.ఐలు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి వ్యాయామాలు చేయాలి?

Satyam NEWS

కొన ఊపిరితో ఉన్న సినిమా గొంతు నొక్కేశారు….

Satyam NEWS

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు

Bhavani

Leave a Comment