33.2 C
Hyderabad
May 4, 2024 02: 09 AM
Slider హైదరాబాద్

కేపీ హెచ్ బీ కాలనీ లో అత్యంత వైభవంగా సీతారాముల శోభ యాత్ర

#pannala

శ్రీరామనవమి సందర్భంగా కే పీ హెచ్ బీ కాలనీ లొ గురువారం అత్యంత వైభవంగా సీతారాముల శోభా యాత్ర నిర్వచించారు. బీజేపీ మహిళా నాయకురాలు లక్ష్మీ ఆదర్శంలో రమ్య గ్రౌండ్ నుండి టెంపుల్ బస్టాప్ మీదుగా రోడ్ నెంబర్ రెండు లొ గల హనుమాన్ దేవాలయం వరకు సీతారాముల శోభ యాత్ర   ఘనంగా నిర్వహించారు. ఈ యాత్రలొ ప్రజా ప్రతినిధులు, రామ భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో  పాల్గొన్నారు.

ఆద్యంతం భక్తి పారవశ్యం తో సాగిన  ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో రామభక్తులు ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలతో ప్రతిధ్వనించారు, పెద్ద కుంకుమ జెండాలను రెపరెపలాడించారు.

బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర రావు, కార్పొరేటర్ మహేందర్, సీత రాముల విగ్రహానికి పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో యువకులు కుంకుమ పువ్వు టోపీలు, కుర్తాలు మరియు కండువాలు ధరించి, ఊరేగింపులో భారీ సంగీత వాయిద్యాల నుండి వచ్చే అధిక-డెసిబెల్ ట్యూన్లకు నృత్యం చేశారు. ఊరేగింపు అంతటా భక్తులు శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణ, హనుమంతుల విగ్రహాలతో కూడిన రథాలు కాలనీల్లో ఊరేగుతుండగా భక్తులు నుంచి పూలమాలలు, నమస్కారాలతో  వేసి స్వాగతం పలికారు. ఈ  కార్యక్రమంలో బిజేపి నాయకులు సాధు ప్రతాప్ రెడ్డి,గురుప్రసాద్ సత్యనారాయణ, రఘురాం, మగ్ధుం,. చిన్న,నరేంద్ర రెడ్డీ, బీ అర్ ఎస్ నాయకులు కట్టా నరసింహ రావు, జన సేన నాయకులు కొల్లా శంకర్ లలో పాటు సాయి నాధ రెడ్డీ, గాలి రెడ్డి, సుబ్బారెడ్డి లు పాల్గొన్నారు.

Related posts

ఫ్యామిలీ డాక్టర్ పథకం ఆరోగ్యశ్రీకి రెండో దశ

Bhavani

బోడ్రాయి, సీసీ రోడ్డు నిర్మాణాల‌కు శంకుస్థాప‌న‌

Sub Editor

ఆర్టీసీ కార్మిక సోదరులారా సమ్మె విరమించండి

Satyam NEWS

Leave a Comment