సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం శోభనాద్రిగూడెం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం నక్కగూడెం గ్రామంలో డీఎంఎఫ్టీ నిధుల ద్వారా రూ. 14 లక్షల విలువ గల సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో చింతలపాలెం జడ్పీటీసీ చింతారెడ్డి సైదిరెడ్డి, మండల అధ్యక్షుడు మోర్తాల వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గుండా బ్రహ్మారెడ్డి, సర్పంచ్ లు దేశినేని హైమవతి రామారావు, రవీందర్ నాయక్, మాజీ ఎంపీపీ చోక్లా, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వరద సహాయంపై బురద రాజకీయాలు