28.7 C
Hyderabad
May 5, 2024 07: 58 AM
Slider రంగారెడ్డి

కుషాయిగూడాలో ఘనంగా శోభాయాత్ర

#kushaiguda

ఉప్పల్ నియోజకవర్గ కాప్రా సర్కిల్ లోని   కుషాయిగూడ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి పురస్కరించుకొని శ్రీరాముడి శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. గురువారం కుషాయిగూడ బస్టాండ్ లో శ్రీరాముడి ప్రతిమకు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. కుషాయిగూడ సరస్వతి శిశు మందిర్ విద్యార్థుల సంప్రదాయక నృత్యాలు, కాషాయం జెండాలు, జైశ్రీరామ్ నినాదాలతో కుషాయిగూడ ప్రధాన రోడ్డులో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఇక బజరంగ్దళ్ కార్యకర్తలు భక్తులు కాషాయం రంగులో ఏర్పాటుచేసిన తలపాగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక శోభాయాత్ర  ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కుషాయిగూడ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు నేతృత్వంలో… గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.  బందోబస్తులో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి , ఎస్సై ఉపేందర్ యాదవ్, పోలీస్ సిబ్బంది ఉన్నా రు. ఈ శోభాయాత్రలో జిహెచ్ఎంసి మాజీ మేయర్ బోంతు రామ్మోహన్,  టిపిసిసి కార్యదర్శి, కాప్రా సర్కిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్, స్థానిక భాజపా నాయకులు చల్ల ప్రభాకర్, శర్మ, వెంకుల్, బ్రహ్మచారి, చల్ల సురేష్, గణేష్, హరి నాయక్, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్

Related posts

విజయనగరం డీఆర్ఓ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

Satyam NEWS

మర్రిగూడెం గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎస్ కె మౌలానా

Satyam NEWS

మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించాలి

Satyam NEWS

Leave a Comment