సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మర్రిగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం బుధవారం జరిగింది.
ఈ సమావేశంలో నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మర్రిగూడెం గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా షేక్.మౌలానా ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గ్రామ శాఖ అధ్యక్షుడిగా షేక్.మౌలానా, ఉపాధ్యక్షుడుగా శ్రీపతి పిచ్చయ్య, ప్రధాన కార్యదర్శిగా సన్నిధి వెంకటనర్సు, కోశాధికారిగా పేరుపంగు మల్లేష్, గౌరవ సలహాదారుగా సయ్యద్ ఇబ్రహీం,షేక్.హయ్యారుద్దీన్,గౌరవ అధ్యక్షుడిగా పి.జోగేశ్వరరావు,షేక్ జానీమియా ను ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కడియం వెంకటేశ్వర్లు, సయ్యద్ పాషా,ఆదినారాయణ,పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్