స్వతంత్య్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, సమతావాదిగా, తన పాలనా దక్షతతో దేశానికి విశేష సేవలందించిన భారత మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘన నివాళులు అర్పించారు.
ఖమ్మం నగరంలో తెలంగాణ తల్లి సర్కిల్ నందు గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు పగడాల నాగరాజు, కొల్లు పద్మ, కంచర్ల దయాకర్, అరెంపుల వీరభద్రం, భాస్కర్, ఏడెల్లి బిక్షం, షకీన, నారమళ్ల వెంకన్న, షంశుద్దిన్, తన్నీరు శోబారాణి, యేచ్చు ప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.