నరసరావుపేట పట్టణంలోని స్థానిక 25 వ వార్డు పెద్ద చెరువు చెందిన పచ్చవ హేమంత్ కి ఎన్టీఆర్ మోడల్ స్కూల్ లో అడ్మిషన్ లభించింది.ఎన్టీఆర్ మోడల్ స్కూల్ లో అడ్మిషన్ పొందడానికి అన్ని విధాలగా సహకరించిన నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబును విద్యార్థి కుటుంబ సభ్యులతో కలిసి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా డా౹౹చదలవాడ మాట్లాడుతూ…….కర్తవ్య దీక్షతో కార్యకర్త సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం,కార్యకర్తల సంక్షేమ నీది,రక్తదాన శిబిరాలు,కార్యకర్తల పిల్లలకు నాణ్యమైన విద్య కోసం తెలుగుదేశం పార్టీ అహర్నిశల కృషి చేస్తుందన్నారు.
నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమం కోసం చేసే కష్టం ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేయలేదని కొనియాడారు.విద్యతోటే సంస్థ రుగ్మతలు రూపుమాపబడతాయని మిగతా రాజకీయ పార్టీలా కార్యకర్త అంటే కేవలం జెండా మోసే కూలీలుగా కాకుండా కుటుంబ సభ్యులా విద్య,వైద్యం అన్ని సౌకర్యాలు కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ చేసే సేవ ఏ రాజకీయ పార్టీ చేయలేదన్నారు.
ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో విద్యను అభ్యసించిన ఎందరో నేడు ఐటి దిగ్గజాలుగా ఐటీ రంగాన్ని ఏలుతున్నారని డా౹౹చదలవాడ గుర్తు చేశారు.ఎన్టీఆర్ మోడల్ స్కూల్ లో అవకాశం కల్పించిన పార్టీకి,తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థికి డా౹౹చదలవాడ సూచించారు.ఈ తల్లిదండ్రులతో పాటు,క్లస్టర్ ఇంచార్జ్ కావూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.