మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామచరణ్ లు నటించిన ‘ఆచార్య’ సినిమా ట్రైలర్ ను మంగళవారం సాయంత్రం 5.49 గంటలకు అభిమానుల నడుమ విజయవాడ శైలజ థియేటర్లో ప్రదర్శించారు. విజయవాడ చిరంజీవి యువత ఆధ్యక్షులు కె.రాకేష్ నాథ్ ఆధ్వర్యంలో మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో ‘ఆచార్య’ టైలర్ ను తిలకించారు.
తండ్రీ తనయులు పోటాపోటీగా నటించిన సన్నివేశాలను మెగా అభిమానులు సందడి చేశారు. అనంతరం ధియేటర్ ఎదుట విజయవాడ చిరంజీవి యువత ఆధ్వర్యంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షలు సొడిసెట్టీ కృష్ణ ప్రసాద్ ,లకనం శ్యాం ప్రసాద్, జనసేన విజయవాడ అధ్యక్షులు పోతిన మహేష్ ,అమ్మిశెట్టి వాసు,రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు సుగుణబాబు పాల్గొన్నారు.
అనంతరం అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోడిసెట్టీ కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మెగా అభిమానుల కోసం ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లోని అనేక థియేటర్లలో ఈ రోజు సాయంత్రం ‘ఆచార్య’ ట్రైలర్ ను విడుదల చేశారని పేర్కొన్నారు.
2.33 నిమిషాల నిడివి గల ట్రైలర్ లో మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల నటన మైమర్పించరు, కొణిదల ప్రొడక్షన్స్ నిర్మించిన ‘ఆచార్య’ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేందుకు ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోందన్నారు. ఇప్పటివరకు అపజయం ఎరగని కొరటాల శివ డైరెక్షన్ లో అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ‘ఆచార్య’ మూవీ ఉంటుందని చెప్పారు.