కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ రాజకీయాల నుంచి విరమిస్తున్నట్లు వచ్చిన వార్తలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశ అయిన విషయం తెలిసిందే. ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది. చత్తీస్ గఢ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి కుమారి సెల్జా దీనిపై స్పందిస్తూ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం సంతోషంగా ఉందని మాత్రమే సోనియా గాంధీ చెప్పారని స్పష్టం చేశారు. అంతేతప్ప, రాజకీయాలకు దూరమవుతున్నట్టు ఆమె ఎక్కడా చెప్పలేదని వివరించారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగాలన్న ఉద్దేశం సోనియాకు లేదని తెలిపారు. ప్లీనరీలో సోనియా మాట్లాడుతూ భారత్ జోడో యాత్రతో ఇన్నింగ్స్ కు చరమగీతం పాడడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.
previous post
next post