వైకుంఠ పురం దేవస్థానం కేశఖండన శాలలో దొంగతనం జరిగిన నేపథ్యంలో ఆ దొంగలను పట్టుకునే ఘటనలో గాయపడిన రమేష్ బాబు అనే కానిస్టేబుల్ ను రమేష్ ఆసుపత్రి లో గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పరామర్శించారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని వైద్య అధికారులకు సూచించారు. గుంటూరు జిల్లా తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైకుంఠ పురం దేవ స్థానం కేశ ఖండన శాలలో దొంగతనం జరిగింది.
ఆ ఘటనలో గాయపడి గుంటూరు రమేష్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న పోలీస్ కానిస్టేబుల్ రమేష్ బాబు ను జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తో బాటు అడ్మిన్ అడిషనల్ ఎస్పీ సుప్రజ కూడా ఉన్నారు. గాయపడిన కానిస్టేబుల్ రమేష్ బాబు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ పోలీస్ శాఖ అండగా ఉంటుందని, దైర్యంగా ఉండాలనీ మెరుగైన చికిత్స అందించడానికి కావలసిన చర్యలను తీసుకుంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తో పాటు అడ్మిన్ అడిషనల్ ఎస్పీ సుప్రజ, స్పెషల్ బ్రాంచ్ డి ఎస్ పి సుభాష్ స్పెషల్ బ్రాంచ్ సి ఐ నరసింహ రావు, నగరం పాలెం సి ఐ హైమ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.