23.2 C
Hyderabad
May 7, 2024 21: 50 PM
Slider నల్గొండ

రోడ్డు ప్రమాదం. .ఒకరు మృతి

#road accident

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదంలో లెక్చరర్ మృతి చెందిన ఘటన మండల కేంద్రం చిలుకూరులోని జేజే నగర్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలోని కొత్తపాడుకు చెందిన దాసరి నాగయ్య(35) కోదాడలోని కళాశాలలో అధ్యాపకుడు. అతని భార్య హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్ఎం. వీరిద్దరూ హుజూర్ నగర్‌లో నివాసం ఉంటున్నారు.

నాగయ్య కోదాడ కళాశాలలో విధులు ముగించుకుని హుజూర్ నగర్ వెళుతుండగా చిలుకూరులో ఇతని బైక్, ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొన్నాయి. తల, చేతులకు బలమైన గాయాలు కావడంతో నాగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య గర్భవతిగా ఉండడం విషాదకరం. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Related posts

నుహ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

Satyam NEWS

పాపాల భైరవుడు కేసీఆర్ కు కాలం చెల్లింది

Satyam NEWS

మూడో రిపోర్టర్ ను ఏసీబీ అధికారులు కావాలనే వదిలేశారా

Satyam NEWS

Leave a Comment