స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజంపేట డివిజన్ వ్యాప్తంగా ప్రతి సోమవారం నిర్వహించే “స్పందన” అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కడప జిల్లా రాజంపేట ఆర్డీవో ధర్మ చంద్రా రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో డివిజన్ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల కమిషన్ నియమావళిని అనుసరించి ప్రతి సోమవారం నిర్వహించే “స్పందన” అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆర్డీవో తెలిపారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన అనంతరం తిరిగి ఏప్రిల్ 6వ తేదీ నుండి యథావిధిగా “స్పందన” కార్యక్రమం జరుగుతుందని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.