Slider కడప

టిడిపి ప్రొద్దుటూరు ఇన్ చార్జిగా ప్రవీణ్ కుమార్ రెడ్డి

praveenkumar reddy

కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమన్వయకర్తగా జి వి ప్రవీణ్ కుమార్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కె.కళావెంకటరావు నేటి రాత్రి ఆదేశాలు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఈ నియామకం జరిపినట్లు ఆయన తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన ఈ నియామకం కీలకమైనదిగా పార్టీ నాయకులు భావిస్తున్నారు. జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసి గుర్తింపు పొందిన యువ రక్తంగా జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరు ఉంది.

Related posts

1360 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

Bhavani

“రాజుల” నగరంలో చవితి సందర్భంగా ట్రాఫిక్ ఇక్కట్లు..!

Satyam NEWS

స్పందన ఫిర్యాదులకు తక్షణమే పరిష్కారం చూపండి

Bhavani

Leave a Comment