కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమన్వయకర్తగా జి వి ప్రవీణ్ కుమార్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కె.కళావెంకటరావు నేటి రాత్రి ఆదేశాలు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఈ నియామకం జరిపినట్లు ఆయన తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన ఈ నియామకం కీలకమైనదిగా పార్టీ నాయకులు భావిస్తున్నారు. జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసి గుర్తింపు పొందిన యువ రక్తంగా జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరు ఉంది.