గురు పౌర్ణమి సందర్భంగా అంబర్ పెట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ దంపతులు గోల్నాకా మాజీ కార్పొరేటర్ కాలేరు పద్మ, అంబర్ పెట్ డివిజన్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి అంబర్ పెట్ డివిజన్ లోని పలు ఆలయాల నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఎం సి హెచ్ కాలనీలో మరియు బాపునగర్ లో సాయి బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డివిజన్ ప్రధాన కార్యదర్శి జాఫర్, మధుసూదన్ రెడ్డి, మల్లేష్ యాదవ్, రంగు సతీష్ గౌడ్, మహేష్ ముదిరాజ్, మహేష్ గంగపుత్ర, కుమార్, సూరజ్, శానూర్, ఆదిల్, షేక్ రఫీక్, యూసుఫ్ బాబా, వేణు ముదిరాజ్, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్