ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా యాంటీ డ్రగ్ నివారణా వారోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు జరిగాయి.
దీంతో జిల్లాల్లోని పట్టణాలలో ఈ విధంగానే ర్యాలీలు నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలను ఆదేశించడంతో అటు సీమ జిల్లాల్లోనూ ఇటు కోస్తా జిల్లాల్లోనూ అలాగే ఉత్తరాంద్రలోనూ కూడా ర్యాలీలు జరిగాయి.
ఇందులో భాగంగా విజయనగరం జిల్లా ఎస్పీ సూచనల మేరకు పార్వతీపురం సర్కిల్ పరిధిలో ఎల్విన్ పేట, జీఎల్ పురం ప్రాంతాలలో యాంటీ డ్రగ్స్ నివారణ ర్యాలీలు జరిగాయి.
ఈ మేరకు పార్వతీపురం డీఎస్పీ సుభాష్ ఆధ్వర్యంలో.ఎల్విన్ పేట సీఐ తిరుపతి రావు సమక్షంలో పోలీసులు యాంటీ డ్రగ్ డ్రైవ్ గా..5కే వాక్ అండ్ రన్ ను నిర్వహించారు.
మత్తు పదార్థాలు సేవించడం వల్ల కలిగే అనర్థాలను పార్వతీపురం డిఎస్పీ సుభాష్ ఈ సందర్భంగా ప్రజలకు వివరించి, మత్త పదార్దాల వినియోగం వల్ల వచ్చే అనర్ధాల పట్ల అవగాహన కల్పించారు.