వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం, దగడపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్ రావు పాల్గొన్నారు.
స్వామి వారిని దర్శించుకొని రంగినేని అభిలాష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ పాడిపంటలతో ఆయురారోగ్యాలతో కలసి మెలసి సుభిక్షంగా ఉండాలని అభిలాష్ రావు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.