సిద్ధవటం మండలం లంకమళ్ళ అభయారణ్యంలో ఎర్రచందనం స్మగ్లర్లను ఏరివేసేందుకు కడప జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సందీప్ రెడ్డి ఆ దేశాల ప్రకారం సిద్ధవటం రేంజ్అధికారి ప్రసాద్ ఆధ్వర్యంలోగత మూడు రోజులుగా ఎర్రచందనం స్మగ్లర్ల కోసం వేట మొదలు పెట్టారు. సంక్రాంతి పండుగను కూడా జరుపుకోకుండా మూడు బృందాలుగా ఏర్పడి తరలిపోతున్న ఎర్రచందనాన్ని కాపాడుకునేందుకు స్మగ్లరు లపై ఉక్కు పాదం మోపుతున్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వారిని పట్టుకునేందుకు అడవిలో అణువణువునా జల్లెడ పడుతున్నామని డిప్యూటీ రేంజ్ అధికారి ఓబులేసు తెలియజేశారు. రాత్రిపూట చలి తీవ్రంగా ఉన్న వాటిని ఏ మాత్రం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నామన్నారు అటవీ సంపదను కాపాడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలియజేశారు.
అడవి ప్రాంతంలో 20 మందికి పైగా అటవీ సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడి స్మగ్లర్ల కోసం అన్వేషిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ శేషయ్య బీట్ ఆఫీసర్లు రాజశేఖర్ రెడ్డి పెంచల్ రెడ్డి రమణ నాయక్ రాజేష్ ఈశ్వర్ రెడ్డి అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.