శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా మఠంపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ మన్యం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న కోలాటాల పోటీలను హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి గురువారం ప్రారంభించారు
ఈ సందర్భంగా శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ శ్రీరామ నవమి సందర్భంగా కోలాటాలు, ఆటల పోటీలు నిర్వహించడం చాలా సంతోషకరమని,పండుగ వాతావరణం, పండుగ శోభని మరింత పెంచుతుంది అని అన్నారు.మఠంపల్లి మండలం లోని ఎస్సీ కాలనిలో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మక,పురాతనమైన శ్రీరామ దేవాలయాన్ని సైదిరెడ్డి దర్శించుకున్నారు.మహిమాన్వితమైన ప్రశస్తి కలిగిన దేవాలయానికి స్థానికులు ఏ సాయం కావాలన్న చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి,టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఇరుగు పిచయ్య,మహిళ అధ్యక్షురాలు కందుల నాగలక్ష్మి, రామాలయం కమిటీ అధ్యక్షుడు తవిడబోయిన జోష్,మామిడి విరస్వామి,టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్