39.2 C
Hyderabad
May 3, 2024 13: 06 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీశైల మల్లికార్జునస్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారికి సోమవారం టిటిడి బోర్డు చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి శ్రీశైలంలో పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి చైర్మన్, ఈవోలకు శ్రీశైలం ఆలయ ఈవో  కెఎస్.రామారావు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. చైర్మన్, ఈవో స్వామివారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు టిటిడి చైర్మన్ కు, ఈవోకు తీర్థప్రసాదాలు, స్వామి, అమ్మవార్ల చిత్రపటం అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ఓఎస్‌డి పాల శేషాద్రి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

ఓటు వేసిన తర్వాత….. శ్వాస ఆగింది

Satyam NEWS

ఆకట్టుకునే విధంగా ప్రమిదలు

Murali Krishna

డబ్బుకోసం పిల్లలను అమ్మేస్తున్నారు

Murali Krishna

Leave a Comment