వేములవాడ పట్టణంలో రూ.88 లక్షల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ ,ఫౌంటెన్ ను ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేములవాడ పట్టణం మరియు దేవాలయం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 400కోట్లతో వేములవాడ టెంపుల్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా అభివృద్ధి చేస్తున్నారని ఇప్పటికే దాదాపు రూ. 250కోట్ల పనులు నడుస్తున్నాయని మరో మూడు రోజుల్లో ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం ప్రారంభం కానున్నదని తెలంగాణలో ఉన్న అన్ని పట్టణాలను 250కోట్లతో అభివృద్ధి చేయబోతున్నారని అన్నారు.
రానున్న కాలంలో మరింత అభివృద్ధి కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థం మాధవి,వైస్ చైర్మన్ మధు రాజేందర్ శర్మ, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.