సాక్షాత్ విజయనగరం జిల్లా పోలీసు బాస్… గిరిజనులు గోడు విన్నారు.. వారి బాధను చెవులారా విన్నారు. తమ శాఖ సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారా అని ఆశ్చర్య పోయారు. తాను ఆదేశాలు ఇచ్చినా కేసు నమోదు చేయకపోవడం ఆగ్రహం వ్యక్తం చేసి…నేరుగా సదరు సీఐతో ఫోన్ లోనే మాట్లాడి తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీఐకి ఆదేశాలు ఇచ్చారు.
ఈ తతంగం అంతా….27వ తేదీ గురువారం. పోలీసు బ్యారెక్స్ లో ఓపెన్ హౌస్ నిర్వహించిన అనంతరం ఇక మధ్యాహ్నం ఎస్పీ దీపికా భోజనానికి వెళదామనుకున్న సమయంలో కొత్త వలసకు చెందిన గిరిజన కుటుంబం… వచ్చి.. తమరిచ్చిన ఆదేశాలనే తుంగలో కి మీ సిబ్బందే తొక్కేసారని ఇటీవల ఎస్పీ ఇచ్చిన లిఖిత పూర్వక ఆదేశా పత్రం తీసుకొచ్చి సదరు బాధితులు… తమ గోడు, బాధను ఎస్పీ విన్నవించారు. తక్షణమే చలించిపౌయిన పోలీసు బాస్.. బాధితుల ముందే సదరు పోలీసు సిబ్బంది తో మాట్లాడి…రేపటి లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధితులకు న్యాయం చెయ్యాలని ఆదేశించడం కొసమెరుపు.