కడప జిల్లా సిద్దవటం మండలంలోని వంతాటిపల్లి గ్రామపంచాయతీ లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్యపూజకొనలో ఎస్.రాజంపేట ఎస్సీ కాలనీకి చెందిన నిత్యపూజయ్య (35) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
ద్విచక్ర వాహనంపై నిత్యపూజకోనకు వెళ్తున్నానని చెప్పిన ఆయన ఎంతకూ ఇంటికి రాలేదు. దాంతో ఇంట్లోని వారు చుట్టుపక్కల ప్రాంతాలలో గాలించారు.
నిత్యపూజకోనలోని అక్కదేవతల గుడి వద్ద దుర్వాసన వస్తుండడంతో వెళ్లి చూడగా అక్కడ నిత్యపూజయ్య మృతదేహం కనిపించింది.
అడవి జంతువులు శవాన్ని లాక్కొనితిని ఛిద్రం చేశాయి. నిత్యపూజయ్య ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడో తెలియడం లేదని బంధువులు తెలిపారు.