వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్నీ వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయని కడప పార్లమెంటరీ అధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ హయాంలో టిడ్కో కింద 20 వేల ఇల్లు మంజూరయ్యాయి. టిడ్కో ఇళ్ళు నిర్మాణం 90 శాతం పూర్తి అయ్యాయి. కానీ వైసీపీ ఇళ్లను పేదలకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. డిపాజిట్ చేసిన వారికి కూడా ఇళ్లను కేటాయించలేదు.
ఆధునిక టెక్నాలజీని వినియోగించి మాజీ ముఖ్యమంత్రి టిడ్కో ఇళ్ల నిర్మాణం చేయించారు. ఒక్క సెంటు స్థలంలో పేదలు ఇల్లు ఎలా నిర్మించుకుంటారు. ప్రభుత్వం పేదలకు 2 సెంట్లు స్థలం ఇవ్వాలి.
కొండలు గుట్టల్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నారు. స్థలాల కొనుగోళ్లలో కూడా వైసీపీ నేతలు చేతివాటం ప్రదర్శించారు. టిడ్కో ఇళ్లను వెంటనే పేదలకు కేటాయించాలి. ప్రభుత్వం ఇల్లు కేటాయించక పోతే లబ్ధిదారులను ఇళ్లలోకి చేరేలా టీడీపీ పోరాటం చేస్తుంది. నీరు చెట్టు పనుల బిల్లులు వెంటనే చెల్లించాలి. లేని పక్షంలో పనులు చేయించిన వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి…