27.7 C
Hyderabad
May 4, 2024 08: 57 AM
Slider కరీంనగర్

బండి సంజయ్ అభిమాని ఆత్మహత్యాయత్నం

#bandi

కరీంనగర్ ఎంపిక, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుని మార్పు పై అంతర్లీనంగా పార్టీ లో అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ను తప్పించి.. కేంద్ర మంత్రి.. గతంలో ఉమ్మడి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గా పని చేసిన జీ.కిషన్ రెడ్డి కి టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని బాధ్యత లు అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ నాంపల్లి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో.. కిషన్ రెడ్డి.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

ఈ సంగతి ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న.. కరీంనగర్ వాసి బీజేపీ నేత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. బీజేపీ మానకొండూర్ నియోజకవర్గ నాయకుడు, బండి సంజయ్ అనుచరుడు సొల్లు అజయ్ వర్మ..ఈ అఘాయిత్యం చేసుకున్నారు.

బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించడాన్ని జీర్ణించుకోలేక గత కొద్దిరోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు… సొల్లు అజయ్ వర్మ.బండి సంజయ్ అన్నకు జరుగుతున్న అన్యాయాన్ని, ఆయనకు జరుగుతున్న అవమానాలను తట్టుకోలేక పోతున్నానంటూ ఏడ్చాడు.. సొల్లు అజయ్ వర్మ.

తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రసంగాన్ని టీవీలో వీక్షిస్తూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు.. అజయ్ వర్మ.దీంతో  పురుగుల మంది తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు… వర్మ.దీంతో హుటాహుటిన అజయ్ వర్మను..కరీంనగర్ గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు.. కుటుంబ సభ్యులు, స్నేహితులు. విషమంగా సొల్లు అజయ్ వర్మ ఆరోగ్యం ఉంది.

Related posts

చినజియర్ ఆశీస్సుల కోసం వచ్చిన మధ్యప్రదేశ్ మాజీ సిఎం

Satyam NEWS

శ్రీ ఆదిత్య ఆసుపత్రి ఎండి రవీంద్ర కుమార్ ఆత్మహత్య

Satyam NEWS

ఆన్లైన్ ట్రేడింగ్ గొడవ.. ఇద్దరు కిడ్నాప్

Satyam NEWS

Leave a Comment